అమరావతి : ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు వెళ్తున్న బస్ ప్రమాదవాశాత్తు లోయలో పడి 18 మంది అయ్యప్ప భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరుకు చెందిన 84 మంది అయ్యప్ప భక్తులు శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు రెండు టూరిస్టు బస్సుల్లో బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్న ఒక బస్సు కేరళలోని పతనంథిట్ట వద్ద లోయలో బోల్తా పడింది. బస్సు ఘాట్ రోడ్డు ఎక్కుతుండగా స్టీరింగ్ పట్టేయడంతో వెనక్కి వస్తూ బోల్తాపడిందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు తెలిపారు.
ఏలూరు జిల్లా మాదేపల్లి ప్రాంతానికి చెందిన 18 మంది భక్తులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఘటన విషయాన్ని తెలుసుకున్న
ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి క్షతగాత్రులకు వైద్యం సహాయం నిమిత్తం కేరళ ప్రభుత్వం తో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు .
Kerala | A bus, carrying 44 Sabarimala pilgrims from Andhra, met with an accident near Laha in Pathanamthitta. All injured have been admitted to hospital. Three people, including an 8-yr-old boy, shifted to Kottayam Medical College hospital. Health min Veena George is at the spot pic.twitter.com/8HXeU91JDa
— ANI (@ANI) November 19, 2022