తిరుమల : తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు (Bengaluru) కు చెందిన భవాని అనే మహిళ కుటుంబ సభ్యులతో కలిసి కారులో తిరుమల (Tirumala) కు బయలు దేరింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఎలిపేంట్ ఆర్చి సమీపాన వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందింది. ఘటన విషయాన్ని తెలుసుకున్న టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డి (Dharmareddy) ఆసుపత్రిలో భవాని కుటంబ సభ్యులను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.