అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా( satyasai district)బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద ఆటోను మినీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు దుర్మరణం చెందగా మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి.గాయపడ్డవారిని ధర్మవరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు(Police) ప్రాథమిక అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.