అమరావతి : ఆంధ్రప్రదేశ్లో లంచగొండి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా జుళిపిస్తున్నారు. బాధి తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకుని కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా ఇవాళ ఏపీలోని మూడు జిల్లాలో లంచం తీసుకుంటున్న ఒక తహసీల్దార్, ఇద్దరు గ్రామ రెవెన్యూ అధికారులను రెడ్ హ్యండెడ్గా పట్టుకోవడం సంచలనం కలిగించింది.
గుంటూరు జిల్లా మేడికొండూ రు మండలం వరగాన గ్రామ పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టా పుస్తకం కోసం బాధితుడి నుంచి రూ. 8వేలు లంచం తీసుకున్న మౌలాలి అనే వీఆర్వోను పట్టుకున్నారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లా ములుగపుడి పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పట్టా పాస్ పుస్తకం కోసం వీఆర్వో రూ. 40వేలు డిమాండ్ చేయగా రూ. 20వేలు తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. వీఆర్పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా సీతారామాపురం తహసీల్దార్ సతీశ్ రూ. 10వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు.