విశాఖ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ ప్రమేయం ఉన్నట్లు తమకు అనుమానం కలుగుతున్నదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. తన తండ్రి హత్య కేసులో ఎవరున్నారో సునీత స్పష్టం చేసినప్పటికీ పోలీసుల్లో ఉలుకూ పలుకూ లేదన్నారు. సాక్షిపై వేసి పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఎదుట సోమవారం మరోసారి లోనేష్ హాజరయ్యారు. బాబాని చంపింది అబ్బాయేనని వివేకా కుటుంబసభ్యులు చెప్తున్నారని, ఆ విషయం రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసునని లోకేష్ ఆరోపించారు.
తనపై తప్పుడు వార్తలను ప్రచురించడంతో సాక్షితో పాటు మరో రెండు పత్రికలకు నోటీసులిచ్చినట్లు లోకేష్ తెలిపారు. రెండు సంస్థలు తప్పు జరిగినట్లు ఒప్పుకున్నాయని, సాక్షి మాత్రం రిజైండర్ కూడా ప్రచురించకపోవడంతో పరువు నష్టం దావా వేసినట్లు చెప్పారు. అందుకే కోర్టు ఎదుట సాక్ష్యం చెప్పేందుకు స్వయంగా వచ్చినట్లు తెలిపారు.
పవన్ కల్యాణ్కు మద్దతుగా ట్వీట్లు పెట్టడంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై లోకేష్ స్పందించారు. ఎవరిపై ట్వీట్లు పెట్టాలో కూడా వారే చెప్తారా అని ప్రశ్నించారు. ఓటీపీకి, ఓటీటీకి జగన్మోహన్రెడ్డి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. అన్ని అయిపోయాయని ఇప్పుడు సినిమా పరిశ్రమపై పడ్డారని లోకేష్ దుయ్యబట్టారు. కాగా, విశాఖ విమానాశ్రయంలో నారా లోకేష్కు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 24న కోర్టుకు హాజరయ్యారు.