హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మారిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలను మే 6 నుంచి నిర్వహిస్తున్నందున పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో అధికారులు మార్పులు చేశారు.
మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 2వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఇదే సమయంలో ఇంటర్ పరీక్షలున్నాయి. దీంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసిన పాఠశాల విద్యాశాఖ తాజాగా కొత్త షెడ్యూల్ను ప్రకటించింది.
ఏప్రిల్ 27న తెలుగు
ఏప్రిల్ 28న సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 29న ఇంగ్లీష్
మే 2 గణితం
మే 4 సైన్స్ పేపర్-1
మే 5 సైన్స్ పేపర్-2
మే 6 సాంఘిక శాస్త్రం