శ్రీశైలం : ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం ( Srisailam temple) ఆలయ వసతి గదిలో ఇద్దరు యువతి, యువకులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. ఆలయ పరిసర పరిధిలో ఉన్న గౌరీసదనం వసతిగదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
వసతి గది (Dormitory )నుంచి దుర్వాసన రావడంతో సిబ్బంది కిటికి గదిలోంచి చూడగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో యువకుడి పేరు మల్లేష్గా గుర్తించారు. మరో యువతి పేరు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.