అమరావతి : ఏపీలో ఉద్యోగ సంబంధిత బాకీలపై ఆర్థిక మంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీలో 13 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఏపీ సీఎం అంతా బాగుందని దావోస్లో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక వేదికపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీనిని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు.
సీఎం సలహాదారులకు ఒకటో తారీఖును వేతనాలిచ్చే ప్రభుత్వం ఉద్యోగులకు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను సీఎం నిలబెట్టుకోలేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు బలిపశువుల్లా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులకున్న బకాయిలను వెంటనే తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కొంత మంది ఉద్యోగులకు మూడు, నాలుగు నెలలుగా జీతాలు రాని పరిస్థితి ఉందని వెల్లడించారు.