అమరావతి : కడప వైఎస్సార్ జిల్లా పులివెందులలో టీడీపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. పరమేశ్వర్రెడ్డి అనే కార్యకర్త ద్విచక్రవాహనంపై దిద్దేకుంట నుంచి సింహాద్రిపురం వెళ్తుండగా రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. ప్రత్యర్థులు మరో వాహనంతో ఢీకొట్టారు. దీంతో కిందపడ్డ పరమేశ్వర్రెడ్డిని ఇడ్చుకెళ్లి రాళ్లతో దాడి చేసి చంపివేశారు. మూడు సంవత్సరాల కిందట పరమేశ్వర్రెడ్డి కుమారుడు మహిళా హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆ హత్యను మనుసులో పెట్టుకుని హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
జగన్రెడ్డి ప్యాక్సనిజానికి నిదర్శనం
పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త హత్యను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జరుగుతున్న హత్యలు ఫ్యాక్సనిజానికి నిదర్శనమని దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న జగన్కు రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తమ కార్యకర్తను హత్య చేసిన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హత్యకు గురైన పరమేశ్వర్రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని ఆయన వెల్లడించారు.