అమరావతి : కర్నూలు జిల్లా అవనిగడ్డ(Avanigadda) వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నామినేషన్ ర్యాలీలో(Nomination rally) అపశ్రుతి చోటు చేసుకుంది. ర్యాలీలో పటాకులు కాల్చడంతో నిప్పురవ్వలు(Fire accident) పడి ఇల్లు దగ్ధమైంది. అయితే అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఇల్లు టీడీపీ నేత(TDP leader) వెంకటేశ్వరరావుది కావడం గమనార్హం. కొన్నేళ్లుగా శ్రీనివాసరావు ఇంటి స్థలం విషయంలో వివాదం నెలకొన్నట్లు తెలిసింది.
శ్రీనివాసరావు ఇంటిని ఖాళీ చేయించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించినట్లు సమాచారం. వైసీపీ నేతల ఒత్తిడి తట్టుకోలేక రెండు నెలల క్రితం శ్రీనివాసరావు మృతి చెందినట్లు తెలుస్తున్నది. ఇదే సందర్భంలో నామినేషన్ ర్యాలీలో ఇల్లు దగ్ధం కావడం పలు అనుమనాలకు తావిస్తున్నదని టీడీపీ నేతలు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.