అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లా( anantapuram distirict)లో విషాదం నెలకొని ఉంది. కబడ్డీ(kabaddi)) ఆడుతూ గుండెపోటు(Heart Attack )కు గురైన ఓ విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయన ఇంట్లో విషాదఛాయలు నెలకొని ఉన్నాయి. ఈనెల 1న జిల్లాలోని విద్యార్థి తనూజ్ నాయక్ తోటి స్నేహితులతో కలిసి కబడ్డీ ఆడాడు. బరిలో ఉండగానే అతడు ఒక్కసారిగా వెనక్కివాలిపోయాడు. దీంతో అతడిని హుటాహుటినా స్థానిక ఆస్పత్రి(Hospital)కి తరలించారు.
అతడిని పరీక్షించిన వైద్యులు బెంగళూరు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. కాగా చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సత్యసాయి జిల్లా మడకశిర మండలం అచ్చంపల్లి గ్రామానికి చెందిన తనూజ్నాయక్ అనంతపురం జిల్లా పీవీకేకే కళాశాలలో బీ.ఫార్మసీ చదువుతున్న కుమారుడు అకాల మరణం చెందడం పట్ల గ్రామంలో విషాదం నెలకొని ఉంది.ఆరోగ్యంగా ఉండే తమ కుమారుడికి గుండెపోటు రావడం పట్ల అతడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.