అమరావతి : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సికింద్రాబాబ్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికుల కోసం రేపు (గురువారం )ప్రత్యేక రైలును నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. నంబర్ (07469/07470) గల రైలు గురువారం సాయంత్రం 5.50 కు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి మరసటి రోజు ఉదయం 7.20 గంటలకు తిరుపతికి చేరుకుంటుందన్నారు.
తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 23న రాత్రి 8.15 కి తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.20 కు సికింద్రాబాద్కు చేరుకుంటుం దని తెలిపారు. ఈ రైలు ఖాజీపేట, వరంగల్,మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని పేర్కొన్నారు.