అమరావతి : తనకు రావల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ అర్చకుడు వినూత్న తరహాలో ధర్నా నిర్వహించాడు. వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామంలో మాధవరాయ స్వామీ ఆలయ ప్రధానార్చకులు మాధవాచార్యులు 1976 నుంచి పని చేస్తున్నాడు. అయితే ఇటీవల దేవాదాయశాఖ ఆగస్టు 2న తలపెట్టిన వేలంపాట రద్దు చేసి తనకు రావాల్సిన బకాయిలను ఇవ్వాలని కోరుతూ ఆలయం పక్కనే ఉన్న తేరు గుడిపై కూర్చొని దీక్ష చేపట్టాడు.
46 సంవత్సరాలుగా ఆలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నానని ఇప్పుడు దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుని తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ అర్చకుడు ఆందోళన నిర్వహించాడు. స్పందించిన దేవాదాయశాఖ అధికారులు గ్రామానికి వెళ్లి నచ్చజెప్పడంతో తన నిరసనను విరమించుకున్నాడు.