హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. యర్నగూడెం వద్ద కారు, మెడికల్ వ్యాన్, కంటైనర్ ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం చెందారు. దవాఖానకు తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు.
ఇంకొకరు చికిత్స పొందుతున్నారు. కొవ్వూరు నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారు అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి..పక్కవైపు నుంచి వెళ్తున్న మెడికల్ వ్యాన్, కంటైనర్ను ఢీకొట్టిందని పోలీసులు పేర్కొన్నారు. మృతుల వివరాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.