తిరుపతి : తిరుపతి జిల్లా చంద్రగిరి వద్ద శ్రీవారి భక్తులకు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. జాతీయరహదారిపై కారు దగ్ధమైన ఘటన నుంచి ఆరుగురు భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. తిరుమల నుంచి వేలూరు వెళ్తుండగా కారు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చూసిన భక్తులు వెంటనే కారు నుంచి దిగి తమ ప్రాణాలను రక్షించుకున్నారు.
అదే విధంగా గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద లారీలో మంటలు చెలరేగాయి. డ్రైవర్, క్లీనర్ వెంటనే లారీ నుంచి కిందికి దిగి ప్రాణాలను కాపాడుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని లారీ మంటలను ఆర్పివేశారు.