అమరావతి : ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఆర్టీసీ బస్సు ప్రమాదవాశాత్తు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఆ సమయంలో విద్యుత్ నిలిచిపోవడంతో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా వింజమూరు వెళ్తుండగా జరిగిన ఘటనలో ట్రాన్స్ఫార్మర్, ఏడు విద్యుత్ స్తంభాలు ధ్వంసం అయ్యాయి.
బస్సులో ఉన్న 12 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇటీవల సత్యసాయి జిల్లా చిల్లకొండయ్యపల్లిలోని తాడిమర్రిలో ఆటోపై విద్యుత్ తీగలు తెగి పడి ఐదుగురు సజీవ దహనమైన విషాద ఘటన తెలిసిందే. ఇదే ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.