అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినప్పటికీ మరో 61 మంది ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. బుధవారం ఏలూరు(Eluru) జిల్లా కైకలూరు వద్ద ఆర్టీసీ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
61 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు (RTC Bus) ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా కైకలూరు వద్ద ఒక్కసారిగా కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికలు ఒకరిపై ఒకరు పడడంతో తీవ్రంగా గాయపడి ఇద్దరు మృతి చెందారు. మిగతా ప్రయాణికులను స్థానికులు వెంటనే స్పందించి బస్ అద్దాలను పగులగొట్టి సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులకు గాయలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.