AP News | పీకలదాకా తాగిన తర్వాత మందుబాబులు వేసే చిందులు అన్నీ ఇన్నీ కావు.. వాళ్లు చేసే చేష్టలు నభూతో న భవిష్యత్తు అనిపించేలా ఉంటాయి. న్యూఇయర్ వేళ ఓ మందుబాబు చేసిన పని కూడా ఇప్పుడు అలాగే ఉంది. డిసెంబర్ 31కి దావత్ అని ఫుల్లుగా తాగిన ఓ మందుబాబు ఏకంగా పోల్ ఎక్కి కరెంటు తీగలపైనే పడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగపురంలో మంగళవారం నాడు ఓ మందుబాబు హల్చల్ చేశాడు. డిసెంబర్ 31st అని పొద్దున్నే తాగేశాడు. అయినా చాలకపోవడంతో మందుకు డబ్బు కావాలని ఇంటికెళ్లి వాళ్ల అమ్మను అడిగాడు. కానీ ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో కోపంలో బయటకు వెళ్లిన అతను.. దగ్గరలో ఉన్న కరెంటు పోల్ ఎక్కేశాడు. మద్యం మత్తులో అతను విద్యుత్ స్తంభం ఎక్కడం చూసిన పలువురు అతని దగ్గరకు పరిగెత్తారు. కానీ వాళ్ల మాటలేమీ పట్టించుకోకుండా అతను పైకి ఎక్కేశాడు. దీంతో కరెంటు తీగలు ముట్టుకుంటాడేమో అన్న భయంతో స్థానికులు ట్రాన్స్ఫార్మర్ ఆపేశాడు.
మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు
మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో గ్రామస్థులను హడలెత్తించిన ఓ తాగుబోతు
మద్యం మత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కుతుండటంతో చూసిన పలువురు వెంటనే ట్రాన్స్ ఫార్మర్ ఆపేశారు
అతను ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు.… pic.twitter.com/0p7xLgvEm6
— Telugu Scribe (@TeluguScribe) December 31, 2024
మద్యం మత్తులో కరెంటు పోల్ ఎక్కిన ఆ మందుబాబు అంతటితో ఆగకుండా కరెంటు తీగలపై కాసేపు విన్యాసాలు చేశాడు. అనంతరం వాటిపైనే పడుకున్నాడు. కరెంటు స్తంభం దిగి రావాలని అతని కుటుంబ సభ్యులు, స్థానికులు ఎంతసేపు అడిగినా పట్టించుకోలేదు. దాదాపు అర గంటపాటు ఆ కరెంటు తీగల మీదనే ఉన్నాడు. చివరకు ఏదోలా బుజ్జగించడంతో మెల్లిగా కిందకు దిగాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
అది చూసిన స్థానికులు