హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఐపీఎస్ పీవీ సునీల్కుమార్పై కేసు నమోదైంది. గత ప్రభుత్వ హయాంలో గుంటూరులో తనను కస్టడీకి తీసుకున్న సమయంలో హత్యాహత్నం చేశారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు నగరంపాలెం పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశారు.
సెక్షన్ 120బీ, 166, 167, 197, 307, 326,465, 508(34) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. 2021 మే 14న తనపై హత్యాయత్నం చేశారని, రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని రఘురామ ఫిర్యాదులో పేరొన్నారు. ఈ కేసులో జగన్ను ఏ3గా పేరొన్నారు. ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్కుమార్, ఏ2గా ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయులు, ఏ4గా విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిని చేర్చారు మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో పొందుపర్చారు.