అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి (CS Jawahar reddy) నుంచి ఉత్తర్వులు అందాయి. ఎన్నికల(Elections) ప్రక్రియలో పాల్గొంటే ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘనేనని ఆయన పేర్కొన్నారు.. పోలింగ్ ఏజెంట్లుగానూ వాలంటీర్లు ఉండరాదని, ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనకూడదని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.
2019లో ఏపీలో వైసీపీ జగన్(YS Jagan) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. రాష్ట్రంలోని 2 .48 వేల మందిని వాలంటీర్లుగా నియమించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. పనిలో పనిగా అనధికారికంగా పార్టీ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుండడంతో ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఓటరు జాబితాలో వాలంటీర్లు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎన్నికల సంఘానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదు అందడంతో వాటిని పరిశీలించిన అధికారులు వాలంటీర్లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించవద్దని ఉత్తర్వులు వెలువడింది.