అమరావతి : కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బంగారాన్ని పట్టుకున్నారు. షార్జా నుంచి వచ్చిన మహిళలను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారిని విచారించగా వారి వద్ద నుంచి 970 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారిలో ఒకరు ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి భార్యగా అనుమానిస్తున్నారు. మహిళతో పాటు విమాన సిబ్బందిని అధికారులు ప్రశ్నించారు.