అమరావతి : స్థానిక జంతువుల దాడితో భయాందోళనకు గురవుతున్న స్థానికులు నక్కల దాడి(Fox Attack) కి గజగజ వణుకుతున్నారు. ఏపీలోని అనంతపురం(Anantapuram) జిల్లా రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లి గ్రామంలో గురువారం అటవి ప్రాంతం నుంచి వచ్చిన నక్క గ్రామస్థుల (Villagers) పై దాడికి పాల్పడింది. ఈ దాడిలో 8 మందికి గాయాలయ్యాయి.
దాడికి పాల్పడ్డ నక్కను గ్రామస్థులు వెంటపడి కొట్టి చంపివేశారు. ఈ విషయాన్ని అటవి అధికారులకు (Forest Officials) ఫిర్యాదు చేయడంతో వారు గ్రామానికి వచ్చి విచారణ జరిపారు. కాగా నక్క దాడిలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.