తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు 9 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. వీరికి సర్వదర్శనం 8 గంటల్లో అవుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నిన్న స్వామివారిని 64,107 మంది భక్తులు దర్శించుకోగా 30,482 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.79 కోట్లు వచ్చిందని తెలిపారు.