అమరావతి : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తీసుకుంటున్న చర్యలకు ఏపీలోని శాసనసభ్యులు స్పందిస్తున్నారు. ఏపీలో ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించిన సభ్యులకులిఖిత పూర్వక హామీని తెలియజేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ప్రకటించింది. అసెంబ్లీ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం స్పందించి ఖాళీల వివరాలను వెల్లడించింది .
రాష్ట్రంలో 66,309 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు7,71,177 ఉండగా వీటిలో 5,29,868 మంది శాశ్వత ఉద్యోగులు, లక్షా 75 వేల మంది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మొత్తం శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు, 74,868 మంది ఉన్నారని వివరించింది. ఇప్పటి వరకు లక్షా 27 వేల మందిని గ్రామ, వార్డు సచివాలయాల్లో భర్తీ చేశామని, వైద్యారోగ్య శాఖలో 22,306 మందిని భర్తీ చేశామని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.