అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో
1,01,544 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 6,617 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనాతో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో 24 గంటల్లో 10,228 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1826751కు చేరింది. ఇప్పటి వరకు 1743176 మంది కోలుకున్నారు. కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 12109కు పెరిగింది.