అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు (Supplementary Exams ) ఈనెల 24వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్కుమార్ (Suresh Kumar) తెలిపారు. పరీక్షల కోసం 1,61,877 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు. వీరిలో 96,938 మంది విద్యార్థులు, 64,939 మంది విద్యార్థినీలు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు 685 పరీక్షా కేంద్రాలు (Exams Centres) ఏర్పాటు చేశామని వెల్లడించారు.
పరీక్షల నిర్వహణ కోసం 685 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 685 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 6,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 86 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ (Flying Squads) ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. 24న ఫస్ట్ లాంగ్వేజ్, 25న సెకండ్ లాంగ్వేజ్, 27న థర్డ్ లాంగ్వేజ్, 28న మాథమెటిక్స్, 29న ఫిజికల్ సైన్స్, 30న బయోలాజికల్ సైన్స్, 31న సోషల్ స్టడీస్, 1న ఓఎస్ఎస్ పేపర్-1, 3న ఓఎస్ఎస్సీ పేపర్-2 పరీక్షలు జరుగుతాయన్నారు.