అమరావతి: చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి పునర్దర్శనానికి ఆలయ అధికారులు తేదీని ఖరారు చేశారు. ఈ నెల 21 నుంచి స్వామివారిని దర్శించుకోవచ్చని వెల్లడించారు. ఎన్నారై దాత ఇచ్చిన రూ. 10 కోట్ల ఆర్థిక సహాయంతో గత ఏడాదికాలంగా ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బంగారు ధ్వజస్తంభం, ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుండడంతో ఈనెల 15 నుంచి చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు
ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం చేపట్టనున్నారు. 15 నుంచి 21వ తేదీ వరకు వేద స్వస్తి, గణపతి పూజ, స్వస్తి వచనం, రక్షాబంధనము, వాస్తు శాంతి, అంకురార్పణ, అఖండ దీపారాధన కార్యక్రమాలను వారం రోజుల పాటు నిర్వహిస్తారు. 21న మృగశిర నక్షత్రం యుక్త శుభ కన్యా లగ్నం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు విమాన గోపురం, ధ్వజస్తంభమునకు మహా కుంబాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
24వ తేదీ నుంచి మూల విరాట్ కి ప్రత్యేక అభిషేకాలు, పాలాభిషేకాలు భక్తులకి అందుబాటులో రానున్నాయని వెల్లడించారు. ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం కొన్ని నెలలుగా మూల విరాట్ గర్భాలయాన్ని మూసివేసి బాలాలయంలో బాల గణపతి దగ్గరే భక్తులకు సర్వదర్శనం కొనసాగిస్తున్నారు.