ధర రూ.55,494.. ఎలక్ట్రిక్ చేతక్ బుకింగ్స్కు బ్రేకులు
ముంబై, ఏప్రిల్ 15: బజాజ్ ఆటో కంపెనీ తన సీటీ మోటర్సైకిళ్ల శ్రేణిని మరింత విస్తరించింది. సీటీ-110ఎక్స్ బైక్ను గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.55,494గా నిర్ణయించింది. 115 సీసీ డీటీఎస్-ఐ ఇంజిన్తో నడిచే ఈ బైక్ 7 కిలోల వరకు బరువును మోయగలిగే రియర్ క్యారియర్, సెమీ నాబీ టైర్లు, స్కేర్ ట్యూబ్, ఇంటిగ్రేటెడ్ ట్యాంక్ ప్యాడ్స్ తదితర ఫీచర్లను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మైలేజీ విషయంలో రాజీపడకుండా రైడర్లకు సౌకర్యవంతంగా ఉండేలా ఎంతో మన్నికతో ఈ బైక్ను రూపొందించింది. ఇదిలావుంటే, ఈ నెల 13న ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్లను పునఃప్రారంభించిన బజాజ్ ఆటో కనీసం రెండ్రోజులైనా తిరక్కుండానే ఆ ప్రక్రియకు బ్రేకులు వేసింది. సరఫరాల చైన్లో అనిశ్చిత పరిస్థితులే ఇందుకు కారణమని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.