రుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతిఒక్కరు అనుకుంటారు. స్వామివారి దివ్య దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇక సెలవు రోజులు, వారాంతాల్లో వచ్చే భక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా టికెట్లు బుక్చేసుకున్నవారే కాకుండా సర్వ దర్శనానికి క్యూకడతారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్యను టీటీడీ (TTD) వెల్లడించింది.
గత నెల తిరుమలేశుడిని 19 లక్షల 6 వేల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపింది. హుండీ ద్వారా రూ.111.71 కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొంది. 95 లక్షల 43 వేల లడ్డులను భక్తులకు విక్రయించినట్లు అధికారులు చెప్పారు. అదేవిధంగా 43 లక్షల 61 వేల మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారని వెల్లడించారు. ఇక 6.56 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని తెలిపారు.