అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,869 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 71,030 శాంపిల్స్ పరీక్షించగా 1,869 మంది కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారింపబడ్డారు. కాగా కొవిడ్-19తో 18 మంది చనిపోయారు. 2,316 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసుల సంఖ్య 19,84,156 కు చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,417గా ఉంది.
జిల్లాల వారీగా నమోదైన కొవిడ్-19 మరణాల వివరాలిలా ఉన్నాయి. చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, అనంతపూర్, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.