తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తుల రాకతో తిరుమల (Tirumala) లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు (Devotees) 18 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) అవుతుందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 71,946 మంది భక్తులు దర్శించుకోగా 30,294 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 4.51 కోట్లు వచ్చిందన్నారు.
శ్రీనివాస అష్టోత్తర శతకుండాత్మక మహాశాంతి వరుణయాగం
సంవృద్ధిగా వర్షాలు కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ టీటీడీ (TTD) ఆధ్వర్యంలో సెప్టెంబరు 8 నుంచి 11వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలో శ్రీనివాస అష్టోత్తర శతకుండాత్మక మహాశాంతి వరుణయాగం నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు ఈ యాగం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.