అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు సరిహద్దు పంచలింగాల అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద జరిపిన సోదాలో అధికారులు భారీగా వెండిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు అభిషేకం అనే వ్యక్తి వెండి ఆభరణాలను కారులో తీసుకెళ్తుండగా సెబి అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో 167 కిలోల వెండి ఆభరణాలను అనధికారికంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
పట్టుబడిన వెండి ఆభరణాల విలువ సుమారు కోటి 20 లక్షలు ఉన్నట్లు సెబ్ సీఐ మంజుల వెల్లడించారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.