తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 29 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనానికి వేచిఉన్నారు. వీరికి 16 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 65,158 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 28,416 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లు వచ్చిందని తెలిపారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు ముగిశాయి.