అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 69,088 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 1,535 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 16 మంది చనిపోయారు. 2,075 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాల వారీగా తాజాగా నమోదైన కొవిడ్ మృతుల వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు, కృష్ణా, నెల్లూరులో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరిలో ఇద్దరు చొప్పున, గుంటూ, వైఎస్ఆర్ కడప, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మరణించారు.