అమరావతి : ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) లో 14 మంది ఐపీఎస్ అధికారులు (IPS Transfers ) బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులను నియమించగా మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి ఐపీఎస్లను బదిలీ చేశారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా, బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్ ను నియమించారు.
నెల్లూరు జిల్లా ఎస్పీగా అజిత వేజెండ్ల, తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బారాయుడు, అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కునుగిలి, కడప జిల్లా ఎస్పీగా నచికేత్, నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ షెరాన్, విజయనగరం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్, కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు, గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్, పల్నాడు జిల్లా ఎస్పీగా డి. కృష్ణారావు, ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్దన్ రాజు, చిత్తూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్కుమార్ను నియమించారు.