తిరుమల: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు 12 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. మొత్తం 18 కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్శనానికి వేచియున్నారని పేర్కొన్నా రు. నిన్న 77,277 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 31,272 మంది తలనీలాలు సమర్పించు కున్నారు. . భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.36 కోట్లు వచ్చిందని తెలిపారు.
ఈనెల 11న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో డయల్యువర్ ఇవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని సూచించారు. భక్తులు0877-2263261 నెంబరుకు సంప్రదించాలని సూచించారు.