తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. వీరికి దర్శనం 10 గంటల సమయం పడుతుందని తెలిపారు. నిన్న శ్రీవారిని 62,203 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,100 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.91 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా రెండు రోజులు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25న సూర్య గ్రహణం కారణంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల 30 నిమిషాల వరకు ఆలయం మూసివేస్తున్నట్లు తెలిపారు.
నవంబర్ 8న ఉదయం 8 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 7 గంటల 30 నిముషాల వరకు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వివరించారు. గ్రహణం రోజుల్లో వీఐపీ బ్రేక్, శ్రీవాణి, రూ.300 దర్శనాలు, ఆర్జిత సేవలు, అన్నీ రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.