తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశం నుంచే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉన్న స్వామివారు భక్తులు తిరుమల (Tirumala) కు చేరుకుంటున్నారు. దీంతో 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియుండగా టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan ) అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 62,304 మంది భక్తులు దర్శించుకోగా 20,261 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.61 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు.