హైదరాబాద్: మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబసభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘పెద్దలు రోశయ్య మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా పదవులను అలంకరించిన రోశయ్య మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
రోశయ్య మృతి బాధాకరమని చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. . రోశయ్య పరిపాలనాధక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు గడించారన్నారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారని తెలిపారు. వివాదరహితుడిగా నిలిచారన్నారు. రోశయ్య మృతి పట్ల కుటుంబ సభ్యులకు, అభిమానులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.