హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్కల్యాణ్ సాధించిన విజయంపై ప్ర ముఖ నటుడు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ‘డియర్ కల్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా.. అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించావ్. నిన్ను చూస్తుంటే ఓ అన్నగా గర్వంగా ఉంది. నువ్వు ‘గేమ్ చేంజర్’ మాత్రమే కాదు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉ ప్పొంగుతుంది.
నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు.. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్ర జా సంక్షేమం కోసం, నీ కలల్ని, నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాన్ని ని జం చేసే దిశలో నిన్ను నడిపిస్తుందని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా’ అని చి రంజీవి ఎక్స్లో పేర్కొన్నారు. చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్నారని చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ దురంధరులైన మీపై, పవన్, మోదీపై ప్రజల విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ర్టాన్ని తిరిగి గాడినపెట్టి నంబర్వన్గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.