Bangladeshis arrested for trying to steal ATM
అమరావతి : ఏపీలోని కృష్ణ జిల్లా గన్నవరం పట్టణంలోని ఏటీఎంలో చోరీకి యత్నించిన బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బంగా, బంగ్లాదేశ్ సరిహద్దుకు చెందిన ఆరుగురు సభ్యులు గల ముఠా వాహనంలో గన్నవరానికి చేరుకున్నారు. స్థానిక సినిమాహాళ్ల కూడలి సమీపంలోని ఏటీఎంవద్ద అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మణీంద్ర గమనించాడు.
వారిని పట్టుకునే క్రమంలో సదరు వ్యక్తితో పాటు మరో ఐదుగురు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో కానిస్టేబుల్ వెంబడించి ఒకరిని పట్టుకోగా అతడిపై దాడి చేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న మిగతా పోలీసు సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకు న్నారు. మిగిలిన ఐదుగురు మదర్ థెరెసా, చెంచుల కాలనీ మీదుగా పరారయ్యే క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో మరొకరు పోలీసులకు చిక్కగా నలుగురు పారిపోయారు.
నిందితులు చోరీకి వినియోగించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తు న్నారు. పట్టుబడ్డ ఇద్దరు నిందితులు బంగ్లాదేశ్ పౌరసత్వం కలిగి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆ దేశ ఎంబసీకి సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు.