అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడి తుఫాన్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల 48 గంటల్లో తుఫాన్ ఉత్తర కోస్తాంధ్ర తీరంలో దాని ప్రభావం కనిపిస్తుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
కోస్తాంద్ర తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని, కోస్తాంద్ర జిల్లాల రైతులు పంటలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.