హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): పచ్చిమిర్చి ఆకుపచ్చ రంగులో, ఎండుమిర్చి ఎరుపు రంగులో ఉండటం చూశాం. కానీ, పసుపు రంగులో ఎండు మిరపను చూశారా? ఖమ్మం జిల్లా తిప్పారెడ్డిగూడేనికి చెందిన ఉపేందర్ పసుపు రంగు మిర్చిని సాగు చేస్తున్నాడు.
ఎకరంలో సాగుచేయగా 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్టు ఆ రైతు తెలిపాడు. ఔషధ గుణా లు ఉన్న ఈ మిర్చి కొనుగోలుకు వ్యాపారులు పోటీ పడుతుండటంతో క్వింటా రూ.70 వేలు పలుకుతున్నది.
నిరుడు అక్టోబర్, నవంబర్లో పసుపురంగు మిర్చి ధర క్వింటాకు రూ.1.25 లక్షలు పలికినట్టు రైతు ఉపేందర్ తెలిపారు. తన పంటను ఇప్పు డు విక్రయించకుండా అధిక ధర కోసం కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచినట్టు చెప్పాడు. పసుపురంగు మిర్చి సాగుకు ఇతర ప్రాంతాల రైతులు ఆసక్తి చూపుతున్నారు.