Chemanthi Cultivation | వ్యాపార సరళిలో పండించే పూలలో గులాబీ తర్వాతి స్ధానం చేమంతిదే. సన్న, చిన్నకారు రైతులు తక్కువ కాలంలో మంచి దిగుబడుల కొరకు పెంచుతున్నారు. విడి పూలుగా, దండలు కట్టేందుకు, కట్ ప్లేవర్గా చామంతికి చలికాలం మంచి గిరాకీ ఉంటుంది. పండుగలు, పర్వదినాలు, పూజలకు చేమంతులను తప్పని సరిగా వాడుతుండటంతో వీటి సాగును ఎంచుకుని లాభాలను సొంతం చేసుకోవచ్చు.
నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పూలు కోతకు వస్తాయి. ఒక పంట కాలంలో దాదాపు 10-15 సార్లు పూలు కోసుకోవచ్చు. చేమంతి రకాన్ని బట్టి 90-120 రోజులలో పూలు కోతకు వస్తాయి. కట్ ప్లేవర్ గానైతే పొసవతి కథతో పూలను కోసి, వెంటనే బకెట్ నీటిలో ఉంచాలి. విడిపూలను మార్కెట్ కు తరలించాలి. రైతులు పాటించే పద్దతులను బట్టి ఎకరాకు 8-10 టన్నుల పూల దిగుబడిని పొందవచ్చు.
వాతావరణం
శీతాకాలంలో ఎక్కువగా పుష్పించే మొక్క ఇది. పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉండే రోజుల్లో త్వరగా పూతకు వస్తాయి. ఈ పూలను పండుగల సమయంలో ఎక్కువగా వినియెగిస్తారు. ఆ డిమాండ్ ను అందుకోవడానికి కనీసం 100 రోజుల ముందు చేమంతిని నాటుకొని శాస్త్రీయంగా పెంచుకోవడంపై దృష్టిసారించాలి.
తోట యాజమాన్యం
డ్రిప్ ద్వారా నీరు ఇస్తే కలుపు బెడద తక్కువగా ఉంటుంది. 1-2 సార్లు మొక్క దగ్గర మట్టిని కదిలిసై వేరు వ్యవస్ధ బాగా వృద్ధి చెందుతుంది. మొక్క దగ్గర నీరు నిల్వకుండా చూడాలి. లేదంటే వేరు కుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది.
ఎరువులు
ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 60-80 కిలోల నత్రజని, 30-40 కిలోల భాస్వరం, 60-80 కిలోల పోటాష్ ఎరువులను వేసుకోవాలి. మొదటి 30 రోజులు ఏపుగా పెరిగేటట్టు చూడాలి. 20 రోజులకు ఒకసారి సూక్ష్మ ధాతు మిశ్రమాన్ని పిచికారీ చేసినటైతే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
పించింగ్
పొలంలోని మొక్కలన్నీ దాదాపు 30 సెం.మీ. ఎత్తు పెరిగిన తర్వాత మొక్కల తలల్ని తుంచివేయాలి. ఇలా చేయటం వలన పక్కకొమ్మలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. తలలు తుంచిన తర్వాత అధిక దిగుబడికి నత్రజని, పోటాష్లను ఇచ్చే ఎరువులను మొక్కలకు అందించాలి. పూలు మంచి పరిమాణంలో పొందేందుకు పై ఎరువులు వేసిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి సూక్ష్మ ధాతు మిశ్రమాన్ని 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఉత్తమివ్వటం
చేమంతి మొక్కలు పూలు పూచే సమయంలో తల బరువుతో కిందికి వాలకుండా కర్రలు పాతి ఊతమివ్వాలి. దీని వల్ల పువ్వుల నాణ్యతను కాపాడుకోవచ్చు.
సస్యరక్షణ
పచ్చపురుగు : ఈ రకం గొంగళి పురుగులు ఆకులు, పువ్వులను తిని నష్టపరుస్తాయి. వీటి నివారణకు క్లొరంత్రనిలిపారోల్ 0.3 మీ.లి. లేదా ధాయేదికార్బ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
తామర పురుగులు : ఇవి గుంపులు గుంపులుగా చేరి మొక్కల రసాన్ని పీల్చి వేస్తాయి. దాంతో మొక్కలు ముడతలు పడి ఎండిపోతాయి. పూలు రంగు మారిపోయి రాలిపోతాయి. వీటి నివారణకు డైమిదోయేట్ లేదా పిప్రానిల్ 2 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.