Pulse crops cultivation | మన దేశంలో పప్పు ధాన్యాలకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ముఖ్యంగా తెలుగు రాష్టాలలో దశాబ్ద కాలానికి ముందు పప్పు ధాన్యాలు పండించడంలో ప్రధమ స్థానంలో ఉండేవి. విప్లవాత్మక మార్పుల కారణంగా పెసర, కంది, మినుము, బొబ్బర, అలసంద, రాగులు, శనగ, నువ్వులు, జొన్నలు, సజ్జలు మొదలైన పంటలు గత 10 ఏండ్ల నుంచి తక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. దిగుబడులు ఆశించినంతగా లేకపోవడం వీటిని పండించేందుకు రైతులు మొగ్గు చూపడం లేదు. కోతుల వల్ల పంటను కాపాడుకోవడం రైతులకు సవాల్గా మారింది. పప్పు ధాన్యాల పంటలు సంవత్సరానికి 2 నుంచి 3 పంటలు పండించే హైబ్రిడ్ రకాలు ఇప్పుడు రైతులకు అందుబాటులో ఉన్నాయి. పెసర, మినుము, అలసందలు తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతంలోనైనా సాగుచేసుకునే వీలున్నది.
పెసర పంటకు అనువైన రకాలు
మినుము పంటకు అనువైన రకాలు
కంది పంటకు అనువైన రకాలు
విత్తన యాజమాన్యం