రాష్ట్రంలో సాగు చేస్తున్న వరి పంటలో జింకు లోపం సాధారణమైంది. వరి నారుమడి లేదా పిలకలు వేసే దశలో సాధారణంగా ఇనుపదాతు, జింకు లోపం కనిపిస్తుంది. నాటిన 2 నుంచి 4 లేదా 6 వారాల్లో ముదురాకు చివర్లో మధ్య ఈనెకు ఇరువైపుల ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. జింక్ లోపం కారణంగా మొక్కల్లో పైనుంచి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈనే పాలిపోతుంది. ఆకులు చిన్నవిగా, పెళుసుగా మారతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. సకాలంలో లోప లక్షణాలు గుర్తించి సవరిస్తే, దిగుబడి, నాణ్యత పెరుగుతుంది.
జింక్ వేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే పంట పాడువుతుంది. జింక్ లోప నివారణకు ఒకే వరి పంటకు భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేదా ప్రతి రబీ సీజన్ లో,ఆఖరి దుమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి.లేదా 10 కిలోల జింక్ సల్ఫేట్ ను 200-500కిలోల బాగా మాగిన పశువుల పేడ లేదా వర్మి కంపోస్ట్ తో కలిపి 20 నుంచి 30 రోజుల వరకు గోనే సంచిలో ఉంచి మాగ బెట్టి ఆ తర్వాత చివరి దుక్కిలో వేయాలి.
జింకు లోపానికి దారితీసే పరిస్థితులు
సల్ఫర్ లోపంతో జింకు లోపం ముడిపడి ఉంటుంది. ప్రధానంగా తటస్థ నేలలు, సున్నపు నేలలు, ముమ్మరంగా పంటలు వేసే నేలలు,మురుగునీరు పోయే సౌకర్యం లేని నేలలు, క్షారత్వపు, చౌడు నేలలు, ఇసుక నేలలు, ఫాస్పరస్, సిలికాన్ మూలకాలు అధికంగా ఉన్న నేలలు, కోతకు గురయ్యే నేలలు, ఆమ్ల నేలలు, గరుకు స్వభావం కలిగిన నేలలు, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం అధికంగా లిగిన నేలల్లో జింకు లోపం అధికంగా ఉంటుంది. కాలుష్యపు మురుగు నీరు పారించే నేలలు, అధికంగా సేంద్రియ ఎరువులు, పంట వ్యర్థాలు వాడే నేలల్లో కూడా జింకు లోప లక్షణాలు కనిపిస్తాయి. వరిలో అత్యధికంగా లోపించే మూలకం జింకు. ఆధునిక రకాలు, పంటల ముమ్మర సాగు, జింకు అధికంగా తీసుకునే రకాల వాడకంతో లోప లక్షణాలు పెరుగుతున్నాయి.
లోప లక్షణాలు
జింకు లోప లక్షణాలు
ఇనుప ధాతు లోప లక్షణాలతో టుంగ్రో వైరస్ లక్షణాలతో పోలి ఉంటాయి. అయితే ఇనుప ధాతువు ఎక్కువగా వేసి పంటల్లో దాదాపు అవే లక్షణాలు కన్పిస్తాయి.
లోప లక్షణాల సవరణ