Davanam Plant | దవనం.. సుగంధ మొక్క. దీనినే మరువం అని కూడా పిలుస్తుంటారు. పువ్వులతో మాట కట్టేప్పుడు ఈ దవనం రెమ్మల్ని కలుపుతుటారు. దేవుడికి పూజలో కూడా దవనం వాడుతుంటారు. సౌందర్య సాధనాల్లో, ఇతర ఔషధాల తయారీలో కూడా దీనిని వాడుతుంటారు.
అదేవిధంగా చెవి నొప్పి, కీళ్లనొప్పులు, జీర్ణకోశ వ్యాధులను నయం చేయడంలో ఆయుర్వేద వైద్యంగా దవనంను వాడుతుంటారు. దవనం ఆకులు, పూల నుంచి దవనం నూనె తీస్తారు. పూల సువాసనకు దవనం వాసన కూడా తోడై మరింత ఆహ్లాదకరాన్ని అందిస్తాయి. శీతాకాలంలో సేధ్యం చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
దవనం రకాలు
దవనం మొక్కలను గార్డెన్లోనే కాకుండా కుండీల్లోనూ పెంచుకోవచ్చు. మంచు ముప్పు దాటిన తర్వాత మరువం మొక్కలను నాటుకోవాలి. తక్కువ ఎదుగుదలతో ఒక అంగుళం పొడవుగా పెరుగుతుంది. కుండీ మరువం – తెలుపు, గులాబీ పువ్వులను కలిగి ఉంటుంది. కుండీల్లో సులువుగా పెరుగుతుంది. ఇది తీపి మరువం కంటే చాలా బలమైన సువాసన కలిగి ఉంటుంది.
తీపి మరువం – ఇది అత్యంత విస్తృతమైనది. బూడిద రంగు నుంచి ఆకుపచ్చగా కనిపించే ఆకులను కలిగి ఉంటుంది. దాదాపు 12 అంగుళాల వరకు పెరుగుతుంది.
వైల్డ్ మరువల – ఇది బలమైన రుచి, వాసన కలిగి ఉంటుంది. గాలి ఎక్కువగా వీచే వేడి వాతావరణంలో మాత్రమే బాగా పెరుగుతుంది. గులాబీ, అప్పుడప్పుడు తెలుపు ఆకులతో అందంగా కనిపించే పువ్వులు తేనెటీగలు, సీతాకోకచిలుకల్ని బాగా ఆకర్శిస్తాయి.
విత్తనం నాటే విధానం
దవనం స్వీయ విత్తనాన్ని ఉత్పత్తి చస్తుంది. శీతాకాలం చివర్లో విత్తనాలను నాటుకోవడం శ్రేయస్కరం, విత్తన ప్లాట్లలో కనీసం ఆరు అంగుళాల వెడల్పు, లోతు ఉన్న కంటైనర్లో విత్తనాలు నాటుకోవాలి. విత్తనాలు లాడ్జింగ్ చేయకుండా ఉండాలంటే స్ప్రే బాటిల్తో నీరు పోయాలి. మట్టిని తేమగా ఉంచాలి. ఎక్కువగా తడిగా ఉంటే విత్తనం మురిగిపోతుంది. ఆరు బయట పగటిపూట గాలి ఉష్ణోగ్రత 16-27 సెంటీగ్రేడ్ గా ఉన్నప్పుడు విత్తుకోవడం మంచిది. విత్తనాలను చల్లి మట్టితో కవర్ చేయాలి.
మొక్క పెరిగిన తర్వాత బాగా పెరిగిన వాటి కాండాన్ని కత్తిరించి మనకు కావాల్సిన ప్రాంతంలో, కుండీల్లో నాటుకోవచ్చు. వేసవి కాలం ప్రారంభంలో కటింగ్కు ఉత్తమం. పువ్వులు పూయని కాండంను గుర్తించి కత్తిరించి మరో కుండీలో నాటుకోవచ్చు. ప్రతి రెండేండ్లకు ఒకసారి పాటింగ్ మిశ్రమాన్ని రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. మొక్క పెరుగుతున్న సీజన్లో వారానికి ఒక అంగుళం మేర నీరు ఇవ్వాల్సి ఉంటుంది. నేల స్థాయిలో తక్కువ పీడనం వద్ద నీటిని అందించేందుకు డ్రిప్ వాడాలి.
పెంపకానికి ఎరువులు
దవనం మొక్కలను ఫలదీకరణం చేసేటప్పుడు దానికి క్రమం తప్పకుండా ఆహారం ఇవ్వాలి. దాంతో మరింత పచ్చగా, నిండుగా మొక్క పెరుగుతుంది. పోషకాల సాంధ్రత పెంచేందుకు సేంద్రీయ పదార్థంతో మట్టిని సవరించాలి. మొక్క పెరుగుతున్న సీజన్లో 2 నుంచి 3 సార్లు కంపోస్ట్ టీ లేదా లిక్విడ్ సీవీడ్ ఎక్క్ట్రాక్ట్తో పిచికారి చేయాలి.
ఆశించే తెగుళ్లు-నివారణ
మొక్కల రసాన్ని అఫిడ్స్ తింటాయి. మొక్కను డీహైడ్రేట్ చేస్తాయి. ఆకులు మొగ్గలను దెబ్బతీస్తాయి. వీటి ద్వారా అనేక ఇతర వ్యాధులు కూడా సంక్రమించే అవకాశాలు ఉంటాయి. వీటి నివారణకు కీటక సబ్బు లేదా వేప నూనె పిచికారి చేయాలి.
స్ప్రైడర్మైట్లు ఆకుల కింది భాగంలో వృద్ది చెందుతాయి. ఆకులు, కాండాల మధ్య సాలీడు వెబ్ కూడా వృద్ధి చెందుతుంది. మార్కెట్లో లభించే పురుగుమందులను వాడటం ద్వారా వీటిని నివారించవచ్చు. వీటి ప్రభావానికి గురైన ఆకులు, కాండం భాగాలను ఎప్పటికప్పుడు తొలగించేయాలి.
అలాగే గాలి లేదా నీటి బిందువుల ద్వారా వ్యాప్తి చెందే మార్జోరామ్ ఆకులపై పసుపు లేదా నారింజ మచ్చలుగా ఫంగస్ తుప్పు కనిపిస్తుంది. తగినంత సూర్యకాంతి అందించడం ద్వారా ఈ వ్యాధిని అడ్డుకోవచ్చు. వ్యాధిని గుర్తించగానే సల్ఫర్, వేప నూనె లేదా పొటాషియం బైకార్బోనేట్ వంటి సేంద్రీయ శిలీంధ్రనాశినితో పిచికారి చేయాలి.