భారతీయ భోజనంలో ఏ ప్రాంతం వారైనా అత్యధిక పోషక విలువలు కలిగిన తోటకూరను తప్పని సరిగా వినియోగిస్తారు. ఇందులో మాంసకృత్తులు, లవణాలు, కాల్షియం, ఇనుము, విటమిన్ ఎ, సి అధికంగా వుంటాయి. మన రాష్ట్రంలో పండించే ఆకుకూరల్లో తోటకూర ముఖ్యమైనది. వేసవి, వర్షాకాలంలో పండించే ఆకుకూరల్లో తోటకూర ఒకటి. ఆకుతోపాటు ఎత్తుగా ఎదిగిన కాడను వివిధ రకాలుగా మేళవించి వంటలు చేస్తారు. ఇక సాంప్రదాయకంగా దొరికే చిలక తోటకూర, కొయ్య తోటకూర. మన రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది. వాణిజ్య పద్ధతిలో సాగుచేయడానికి అనేక హైబ్రీడ్ రకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
వాతావరణం
వివిధ శీతోష్ట పరిస్థితులో పెంచటానికి అనువైనది. నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. శీతాకాలంలో ఉష్టోగ్రత 15 సెంటీగ్రేడ్ కంటే తక్కువ వుంటే పెరుగుదల సరిగా వుండదు.
నేలలు
ఇసుకతో కూడిన గరపనేల అనుకూలం. నీరు నిలిచే బంక మట్టి నేలలు, ఇనుక నేలలు పనికి రావు. రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో విస్తారంగా తోటకూరను సాగుచేస్తారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని గోదావరి నదికి ఇరువైపులా సుమారు 13 మండలాల్లోని అనేక హెక్టార్లలో ఆకు కూరలు ముఖ్యంగా తోటకూర సాగవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలు, కోస్తా జిల్లాల్లోని సముద్రతీరపు గరువు నేలల్లో రుచికరమైన తోటకూర భిస్తుంది.
విత్తన రకాలు
కో1, కో2, కో3, కో4, కో5, పూసా, చోటి చౌలై, పూసాబడి చౌలై, పూసా కీర్తి, పూసా కిరణ్, పూసాలాల్ చౌలై, ఆర్ఎన్ ఎ 1, ఆర్క సుగుణ వంటి రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. విత్తనాలు వేసుకునే ముందు నేలను 4-5 సార్లు బాగా దుక్మిదున్నాలి. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేయాలి. మళ్ళను బాగా చదునుగా చేసుకోవాలి. మడుల్లో పలుచగా విత్తుకోవాలి. ఎకరాకు 800 గ్రాముల చొప్పున విత్తనం అవసరమవుతుంది. విత్తనం వేసేటప్పుడు 10 రెట్లు సన్నని ఇసుకతో కలిపి వేయాలి. కోత రకాలలో విత్తన 25 రోజులకు మొదటిసారిగా తరువాత ప్రతి వారం నుండి 10 రోజులకు ఒక కోత వస్తుంది. 90 రోజులలో ఎకరాకు 4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మొక్కలను వేర్లతో సహా పీకి కట్టలు కడితే ఎకరాకు 3 టన్నుల వరకు దిగుబడినిస్తుంది.
నాలు గైదు సార్లు దుక్కి దున్నాలి. ఎకరాకు 10 టన్నుల పశువు ఎరువును వేయాలి. మడులను బాగా చదును చేసుకోవాలి.
విత్తనాలు వేసే విధానం
2×1.5 మీటర్లు మడులో పలచగా విత్తుకోవాలి. ఎకరాకు 800 గ్రా. విత్తనం అవసరమవుతుంది. విత్తనంతో పాటు 10 రెట్లు సన్నటి ఇసుకను కలిపి వేయాలి. నారుమడిలో పోసుకుని 20×20 సెం.మీ దూరంలో నాటుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ఎకరాకు ఒక కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే రెండు కిలోలు కావాలి.
నీటి యాజమాన్యం
భూమిలోని తేమను బట్టి 7-10 రోజుల వ్యవధితో నీరు కట్టాలి. వేసవిలో ప్రతి 5 -6 రోజుకు ఒక తడిని ఇవ్వాలి. కోస్తా జిల్లాలో నీరు భూమి ఉపరితలం పైననే తక్కువ లోతులో లభించడంతో నీటిని మట్టి కుండలతో వెదజల్లుతారు. ఈ తరహా నీటి యాజమాన్యం వల్ల మొక్క మొలచిన నాటినుండి పంట కోతకు వచ్చే వరకు మొక్క ఏపుగా ఎదుగుతుంది.
దిగుబడి
తోటకూర రెండు రకాలుగా సాగు చేస్తారు. అవి 1. కోతరకం, 2. వేళ్ళతో సహా పీకే రకం. కోత రకాల్లో విత్తిన 25 రోజులకు మొదటిసారిగా కోసుకోవచ్చు. తరువాత 7 లేక 15 రోజులకు ఒక కోత చొప్పున 90 రోజుల వరకు 4.5 టన్ను దిగుబడి తీసుకోవచ్చు. మొక్కను వేర్లతో సహా పీకి కట్టకట్టే రకాల్లో మూడు టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
అంతర పంటగా
వరి పంటలో తోటకూరను వరుస మధ్యలోనూ, గట్లపైన వేస్తారు. వేరుశెనగ పైరులో కూడా అంతర పంటగా సాగు చేస్తారు. పెరట్లో రసాయన ఎరువులు లేకుండా తోటకూరను విత్తుకొని, పశువుల ఎరువు, సేంద్రియ ఎరువు, బయోఉత్పత్తుల సహాయంతో ఇంటికి కావలసిన ఆరోగ్యకరమైన, రుచికరమైన తోటకూరను పండిరచుకోవచ్చు.
తెల్లమచ్చ తెగులు
ఆకు అడుగుభాగానతెల్లటి బుడిపెలు వంటివి ఏర్పడతాయి. ఆకు పై భాగాన లేత పసుపురంగు మచ్చలు ఏర్పడి పండుబారి పోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రా. కాపర్ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ మందును కలిపి పిచికారి చేయాలి. ఆకు అడుగు భాగం తడిచేలా చూడాలి. ఆకును తినే గొంగళి పురుగు, చిన్న, పెద్దవి ఆకును తినివేసి చిల్లులు చేస్తాయి. అందువల్ల మార్కెట్లో సరైన రేటురాదు. వీటి నివారణకు మలాథియాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. చేసిన తరువాత కనీసం 10 రోజుల తరువాత ఆకును కోసుకోవాలి.
ఆకుతినే గొంగళి పురుగు
చిన్న, పెద్ద పురుగు, ఆకును కొరికి వేయడం వల్ల ఆకు పనికి రాకుండా పోవడమేకాక మార్కెట్లో సరైన రేటు రాదు. వీటి నివారణకు మలాథియాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పిచికారి చేసిన తరువాత కనీసం 10 రోజుల వ్యవధి ఇచ్చి ఆకు కోయాలి. మొక్కలేత దశ నుండి వేప సంబంధిత పురుగు మందులను 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసినట్లయితే పురుగులు ఆశించవు.