అభివృద్ధి సాధ్యంఇంద్రవెల్లి, అక్టోబర్13: రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే ఖానాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం దక్కుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. మండలంలోని దస్నాపూర్, పిట్టబొంగురం, మెండపల్లిగోండ్గూడ గ్రామాల్లో శుక్రవారం ఆయన జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పిట్టబొంగురం గ్రామంలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దస్నాపూర్ గ్రామంలోని ఫూలాజీబాబా ధ్యానకేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాబా చిత్రపటానికి నివాళులర్పించారు. జాన్సన్ నాయక్కు మహిళలు, యువకుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. మండలంలోని మెండపల్లిగోండ్గూడలో 150 మం ది, పిట్టబొంగురంలో 100, దస్నాపూర్లో 80 మంది బీఆర్ఎస్లో చేరడంతో వారికి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆదివాసీ పెద్దలతో పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశా రు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, ని యోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరారు. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్తోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా మోసపూరిత హామీలతో గ్రామాలకు వచ్చే నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. జాన్సన్నాయక్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసి, భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.