కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి ఎస్సీ కాలనీకి చెందిన మంద రాజు(49) అనే మహిళ వడదెబ్బకుమృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం కట్టెల కోసం వెళ్లి ఇంటికి వచ్చిన ఆమె ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైంది. రాత్రి పరిస్థితి మరింత విషమించడంతో ఆదివారం ఉదయం 108 అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భర్త భీమయ్య తెలిపాడు.